Monday, 28 April 2025 09:03:12 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

కడప జిల్లా *వెలుగులోకి బ్రిటిష్* *కాలం నాటి తూర్పు* *బావి....!*


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 03 March 2025 03:54 PM Views : 621

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కర్నూల్ జిల్లా : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మామిళ్ల పల్లెకు తూర్పు వైపున బ్రిటిష్ కాలం నాటి బావిని వెలుగులోకి తెచ్చినట్లు రచయిత ,చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ మైదుకూరు మున్సిపాలిటీలోని 1905 బ్రిటిష్ సర్వే మ్యాప్ ఆధారంగా ఈ బావి1268 సర్వేనెంబర్లో ఉన్నట్లు చెప్పారు. ఆనాటి కాలంలోని పిచ్చపాడు గ్రామం (చాపాడు మండలం)లో 400 కుటుంబాలు ఉండేవని వాటిలో ఎక్కువగా కాల్వ, కోనేటి, కాట్రగడ్డ,, మామిళ్ళపల్లె, పిచ్చపాటి అను ఇంటి పేరు కల బ్రాహ్మణులు నివసించేవారన్నారు. దీంతో పిచ్చపాడు గ్రామాన్ని బ్రాహ్మణ అగ్రహారంగా పిలిచేవారు.ఈ బ్రాహ్మణులు పాత మామిళ్ళపల్లెలో కూడా నివసించేవారని చెబుతున్నారు. పాతమామిళ్ళ పల్లెకు చెందిన కాల్వ బ్రాహ్మణులు కర్ణాలుగా పని చేసే సమయంలో ఈ బావిని నిర్మించారని చెప్పారు. బావి గుండ్రంగా, చిన్నదిగా ఉందని అన్నారు. బావి ఎటు చూసినా 12 అడుగుల కటకం ఉంటుందని తెలిపారు. బావికి కుడి వైపు మెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ బావిలోని నీటిని కపిలాల ద్వారా ఆకాలంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసే వారన్నారు. తాగునీటి అవసరాలకు ఈ బావి నీటిని ఉపయోగించేవారని వివరించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ బావి గురించిన సమాచారం తనకు తెలిసేందుకు పాత మామిళ్లపల్లెకు చెందిన కృషివలుడు, కర్షకరత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత పందిటి క్రిష్ణమూర్తి , జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గోశెట్టి రామ్మోహన్ , శ్రీ నగరం రాఘవ సహకరించారని చెప్పారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :