Monday, 28 April 2025 08:34:04 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 01 March 2025 05:27 PM Views : 568

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / మార్చ్ 1/ అక్షరం న్యూస్ - జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలు అయినా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పంచాయతీ, నీటిపారుదల మరియు రెవెన్యూ శాఖ ల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని, నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు ఆయా శాఖల సిబ్బంది కి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూట్ నీకోసం ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో తనిఖీ ల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి వనరులు బఫర్ జోన్ , ఎఫ్ టి ఏ లలో ఉండవద్దన్నారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ సమయంలో నిబంధనలు తప్పనిసరి పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలన చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముందుగా పెండింగ్ దరఖాస్తుల లొకేషన్ ను గుర్తించాలన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు వారాల్లో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను రెండు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆర్డివోలు మధు, దామోదర్ రావు ను ఆదేశించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :