Monday, 10 February 2025 06:35:01 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 February 2025 08:18 PM Views : 126

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ 4 ఫిబ్రవరి /అక్షరం న్యూస్ : బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నవంబర్ 12వ తేదీన బీఎస్పీ లో జాయిన్ అయింది మొదలు ప్రతి సంవత్సరం జిల్లా అధ్యక్ష హోదాలో 2020 మరియు 2021వ సంవత్సరంలో నాకు నిర్దేశించిన జన కళ్యాణ్ దివస్ డబ్బులను అందజేయడం జరిగింది.2022 మరియు 2023 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీకి నిర్దేశించిన డబ్బులను అందజేయడం జరిగింది.2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ నుండి పోటీ చేయుటకు అవకాశం కల్పించినందుకు పార్టీ జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల ఇచ్చిన జన కళ్యాణ్ దివస్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా నాకు ఐదు లక్షలు ప్రతి అసెంబ్లీకి లక్ష చొప్పున ఐదు లక్షలు మొత్తం కలిపి 10 లక్షల రూపాయలను లక్ష్యంగా విధించినారు కానీ అట్టి లక్ష్యాన్ని నేను అందజేయలేక పోతున్నందుకు చింతిస్తూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని అట్టి రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ కు పంపినట్టు తెలిపారు.ఇన్ని రోజులు బీఎస్పీలో తనకు సహకరించిన నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.కామేష్ తో పాటు జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ రావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,సోను, బన్ను తదితరులు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :