Monday, 10 February 2025 07:44:55 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి.. సెల్ ఫోన్ మాట్లాడుతూ.. మద్యం, సేవించి, నిద్ర,మత్తులో వాహనాలు నడపవద్దు... విలువైన ప్రాణాలను కాపాడుకోవాల

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 24 January 2025 07:55 PM Views : 153

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం, స్టాఫ్ రిపోర్టర్ జనవరి వైరా, 23 (అక్షరంన్యూస్) ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తమ వంతు బాధ్యతగా పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కృషి చేయాలని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. వరప్రసాద్ తెలిపారు. గురువారం మధిర పట్టణంలోని శ్రీనిధి కాన్వెంట్ స్కూల్ నందు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు డ్రైవర్ తో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి అని తెలిపారు. కారు లో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ ను తప్పకుండా వాడాలన్నారు. వాహనాలను అతివేగంగా నడిపి ప్రమాదాలకు గురి కావద్దని ,మద్యం మత్తులో వాహనాలను నడపవద్దని వాహనాలను నడిపేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు గుర్తొచ్చే విధంగా ఉండాలని ఆయన అన్నారు .ఎందుకంటే ప్రమాదం జరిగి ఏదైనా జరగదని జరిగితే ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో గమనించాలన్నారు. అదేవిధంగా ప్రతి వాహనదారుడు వాహన దృవపత్రాలు కలిగి ఉండి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అతివేగంగా వాహనాలు నడపద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచందర్, స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు రవాణా శాఖ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :