Monday, 10 February 2025 07:14:57 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఏజెన్సీ విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ పంపిణీ చేసిన గూడూరు సిఐ బాబురావు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 11 January 2025 01:53 PM Views : 119

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : ** మహబూబాబాద్ జిల్లా /గంగారం/(అక్షరం న్యూస్) జనవరి 11 మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు గారు ఈరోజు *కొత్తగూడ* *మండలం* *ఓటాయి* *మండల* *పరిషత్* *ప్రాథమిక* *పాఠశాలను* మరియు *గంగారాం* *మండలం* *తిరుమలగండి* *గ్రామ* *పాఠశాల* లను సందర్శించి, ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన విద్యా విధానాలను సాంకేతికతను అందిపుచ్చుకోలేక, పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ, సకల సౌకర్యాలు కల్పిస్తూ, పూర్తి ఉచితంగా హాస్టల్ సౌకర్యంతో విద్యనందించే తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించినట్లయితే ఏజెన్సీ విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని, మంచి విద్యతో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మంచిగా స్థిరపడేందుకు దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో, గురుకుల విద్యాలయాల ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష మరియు జవహర్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష స్టడీ మెటీరియల్ తో పాటు మోడల్ టెస్ట్ పేపర్ల కు సంబంధించిన బుక్స్ ను విద్యార్థులకు ఉచితంగా అందించడం జరిగింది. *విద్యార్థులకు పాఠాలు బోధించి, ఆత్మీయ పలకరింపుతో పిల్లల్ని ఉత్సాహపరిచిన సీఐ* పుస్తకాల పంపిణీ అనంతరం సిఐ బాబురావు గారు విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించి వారిని కొన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు అడిగి, పిల్లలతో మమేకమై ఉత్సాహపరచడం జరిగింది. ఇచ్చిన మెటీరియల్ బాగా చదువుకొని ప్రవేశ పరీక్ష లో మంచి మార్కులు సాధించి గురుకుల విద్యాలయలలో సీటు సంపాదించాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. మీరంతా నిరుపేద కుటుంబ నేపథ్యం కలవారని, మంచిగా చదువుకోవడం వల్ల మాత్రమే మీ యొక్క జీవితాలు ఉన్నతంగా ఉంటాయని, మంచిగా చదివే విద్యార్థులకు మా ప్రోత్సాహం తప్పకుండా అందిస్తామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మరియు పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున పాఠశాలకు, విద్యార్థులకు ఎలాంటి సహాయం కావలసిన అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడ ఎస్సై కుశ కుమార్, గంగారం ఎస్సై రవికుమార్, ప్రొబెషనరీ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :