Monday, 10 February 2025 06:17:28 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ప్రజా చైతన్యంలో "అక్షరం"దిన పత్రిక పాత్ర కీలకం -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష -అక్షరం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 07 January 2025 05:39 PM Views : 428

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జనవరి 7 అక్షరం న్యూస్; ప్రజా చైతన్యం చేయడంలో అక్షరం దినపత్రిక తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గురువారం అక్షరం దినపత్రిక రూపొందించిన 2025 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కథనాలు అందిస్తూ అక్షరం దినపత్రిక తన ప్రత్యేకతను చాటుకుంటుందని ప్రశంసించారు. సమస్యలపై, రాజకీయ అంశాలపై ప్రత్యేక వార్తా కథనాలను అందిస్తూ ఎప్పటికప్పుడు అక్షరం దినపత్రిక కొత్తదనాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాల అమలుకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా అక్షరం పత్రిక పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్, విలేకరులు నూనె శ్రీనివాస్, ఓడ్నాల అజయ్, వాల్మీకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :