Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : - పెద్దపల్లి ప్రతినిధి జనవరి 7 అక్షరం న్యూస్; ప్రతి అక్షరం ప్రజా సమస్యలపై సంధిస్తూ, అక్షరం దినపత్రిక ప్రజల పక్షం వహిస్తుందని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో అక్షరం దినపత్రిక రూపొందించిన 2025 ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ సరికొత్త వార్త కథనాలతో ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో అక్షరం దినపత్రిక ముందుంటుందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై వార్త కథనాలు అందిస్తున్న అక్షరం దినపత్రిక ప్రజల గొంతుకగా మారి తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా చైతన్యం చేయడంలో అక్షరం దినపత్రిక ఎప్పుడు ముందుంటుంది అన్నారు. నిజాయితీ నిబద్ధతతో పనిచేసే అధికారులు, ప్రజాప్రతిధులపై ప్రత్యేక కథనాలు అందిస్తూ ప్రోత్సాహకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రశంసించారు. అలాగే అవినీతి అక్రమాలపై సమర శంఖం పూరిస్తూ.. అక్షరం పత్రిక తన ప్రత్యేకతను చాటుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దపల్లి అక్షరం ప్రతినిధి దొమ్మటి రాజేష్, అక్షరం పత్రిక విలేకరులు చింతం కిరణ్, నూనె శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily