Monday, 10 February 2025 08:02:24 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ప్రజా పక్షం వహిస్తున్న "అక్షరం" దినపత్రిక -పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు

అక్షరం దినపత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరణ


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 07 January 2025 01:56 PM Views : 175

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : - పెద్దపల్లి ప్రతినిధి జనవరి 7 అక్షరం న్యూస్; ప్రతి అక్షరం ప్రజా సమస్యలపై సంధిస్తూ, అక్షరం దినపత్రిక ప్రజల పక్షం వహిస్తుందని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో అక్షరం దినపత్రిక రూపొందించిన 2025 ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ సరికొత్త వార్త కథనాలతో ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో అక్షరం దినపత్రిక ముందుంటుందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై వార్త కథనాలు అందిస్తున్న అక్షరం దినపత్రిక ప్రజల గొంతుకగా మారి తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా చైతన్యం చేయడంలో అక్షరం దినపత్రిక ఎప్పుడు ముందుంటుంది అన్నారు. నిజాయితీ నిబద్ధతతో పనిచేసే అధికారులు, ప్రజాప్రతిధులపై ప్రత్యేక కథనాలు అందిస్తూ ప్రోత్సాహకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రశంసించారు. అలాగే అవినీతి అక్రమాలపై సమర శంఖం పూరిస్తూ.. అక్షరం పత్రిక తన ప్రత్యేకతను చాటుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దపల్లి అక్షరం ప్రతినిధి దొమ్మటి రాజేష్, అక్షరం పత్రిక విలేకరులు చింతం కిరణ్, నూనె శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :