Monday, 10 February 2025 08:06:07 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :

సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ...


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 18 December 2024 09:22 PM Views : 292

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హేమచంద్రపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం  ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు పాల్గొన్నారు.  జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్  కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ  ఆధ్వర్యంలో ఏఆర్ అధికారులు, సిబ్బంది సమక్షంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎస్పీ  మాట్లాడుతూ  క్రైస్తవ సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ అని అన్నారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటారని తెలిపారు.  ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనంతరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు నరసింహారావు, కృష్ణారావు, లాల్ బాబు,  ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :