Monday, 10 February 2025 07:35:13 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :

-


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 06 December 2024 09:09 PM Views : 304

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/నవంబర్ 6/అక్షరం న్యూస్ :  అక్టోబర్ 21 పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన పోలీస్ అధికారులు, సిబ్బంది,  విద్యార్థులకు   ఎస్పీ రోహిత్ రాజు  శుక్రవారం  తన కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. కేటగిరీల వారీగా నిర్వహించిన ఈ వ్యాస రచన పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతగా ఎంపిక చేయడం జరిగింది. ఎస్సై,  ఆ పై స్థాయి అధికారులకు ఇచ్చిన అంశం "Sound mind in a sound body" లో మొదటి బహుమతి అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, రెండో బహుమతి షీ టీమ్ ఆరెఎస్సై రమాదేవి, మూడో బహుమతిని ఆర్ఎస్ఐ జగన్మోహనాచారీ లు గెలుచుకున్నారు. కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు  ఇచ్చిన అంశం "My role in improving police image in Society" లో డి సి ఆర్ బి లో ఏఎస్ఐ గా పని చేస్తున్న రఘురాములు మొదటి బహుమతిని,  కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాందాస్ రెండో బహుమతిని, టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ రావ్ మూడో బహుమతిని గెలుచుకోవడం జరిగింది. విద్యార్థిని, విద్యార్థులకు ఇచ్చిన అంశం "Judicious Usage of Mobile phones" లో కొత్తగూడెం పట్టణంలోని శ్రీ ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్న  కారుణ్య మొదటి బహుమతిని, పాల్వంచలోని శ్రీ సాయి స్ఫూర్తి DAV స్కూల్లో 8వ తరగతి చదువుతున్న యువతేశ్వరి రెండో బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలలో జిల్లా నుండి విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు అందుబాటులో ఉన్న విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :