Monday, 10 February 2025 06:26:31 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత సి. ఐ మొగిలి

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 24 November 2024 11:41 AM Views : 602

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -23(అక్షరం న్యూస్ ) ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని సి.ఐ మొగిలి పేర్కొన్నారు . శనివారం ముస్తాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చీకోడ్ గ్రామం లో నిర్వహించిన పోలీసు మీ కోసం కార్యక్ర మంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మోసాల కోసం రకరకాలుగా ఫోన్ కాల్ వస్తున్న వాటి గురించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ కాలుకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, ప్రజలకు తెలియజేశారు. ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. బ్యాంక్‌ లావాదేవీలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నేరాలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. అప్రమత్తంగా ఉంటూ వీటిని అరికట్టాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా స్మార్ట్ ఫోన్ లో వచ్చే ఓటీపీలు, మోసపూరితమైన యాప్స్ లను ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు.ఇటీవల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అని, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫీక్‌ నిబంధనలు పాటించాలన్నారు. ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్‌ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని  యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని కోరారు.  యువత డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలకు బానిసలై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా నేరం జరిగితే నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షులుగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఇంటి యజమానులు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే భద్రతపరంగా బాగుంటుందని సూచించారు. నేర రహిత సమాజం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువతి యువకుల పై వారి తల్లి తండ్రులు దృష్ఠి సారించాలని, వారి చదివే కళాశాల లకు వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. గ్రామ ల్లో పెద్ద మనుషులు పంచాయతీ లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ గణేష్, వీపీఓ సంతోష్, ప్రజలు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :