Monday, 10 February 2025 06:27:16 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి.

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 23 November 2024 09:18 PM Views : 170

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ భద్రాచలం /23 నవంబర్/ అక్షరం న్యూస్: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరిపట్టం పెట్టి స్వామి వారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మ వారి కోవెలలో మంత్రి పొంగులేటికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్, ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ. భద్రాచలం రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనిలో భాగంగా ఇప్పటికే 70 కోట్ల రూపాయలను రామాలయం మాడవీదుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని ఈ మాడవీధుల అభివృద్ధికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి ప్రజలకు వ్యాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే రామాలయం అభివృద్ధి జరగడం ఖాయమని ఆయన అన్నారు. అనంతరం ఆలయ అధికారులతో కలిసి రామాలయ మాడవీధుల అభివృద్ధి పనుల వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని ముగ్గురం కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల కూడా రామాలయం అభివృద్ధికి వెనకడుగు వేయరని పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరొకసారి ఆయన గుర్తు చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :