Monday, 28 April 2025 06:47:04 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.... -మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం.... - దశదినకర్మలకు హాజరై గట్ల శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 20 November 2024 08:45 PM Views : 533

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : , నవంబర్20(అక్షరంన్యూస్):ఉమ్మడి ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి దశదినకర్మలు మండలంలోని ఏడూల్ల బయ్యారం గ్రామంలో ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దశదినకర్మలకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు సుమారు 2000మంది పైచిలుకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పినపాక నియోజకవర్గం లో అన్ని మండలాల అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ గట్ల శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని భౌతికంగా శ్రీనివాస్ రెడ్డి లేనప్పటికీ చిరస్థాయిలో అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.నికార్సైన నిబద్ధత నిజాయితీ గల విలువలతో కూడుకున్నటువంటి ప్రజా నాయకుడు ఆయన అని ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు అన్నారు. ఆయన అకాల మరణం కార్యకర్తల నుండి మంత్రుల వరకు అందరినీ కలిచి వేసిందని ఆయన పార్టీకి చేసిన విశిష్ట సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కొర్స ఆనంద్, సాయిని వెంకటేశ్వరరావు, బిజ్జా రామనాథం, మల్లయ్య, సిపిఐ నాయకులు బి.అయోధ్య, స రెడ్డి పుల్లారెడ్డి, నిమ్మల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :