Sunday, 16 March 2025 05:19:35 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్నూరు కాపు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది...

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి...కట్లసంతోష్.* ```


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 20 November 2024 01:13 PM Views : 422

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *```~ ~ ఖమ్మం/ వైరా నవంబర్ 20 (అక్షరంన్యూస్) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య మున్నూరు కాపు సంఘం నాయకులు,కార్యకర్తలు ఏకమై మన వానిని వినిపించకపోతే మరి కొద్ది రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో మన మున్నూరు కాపు కులస్తుల వాటాను గద్దలుల కొల్ల కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతున్నది...సోదరులారా మున్నూరు కాపులకు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 10 సంవత్సరములో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేకమంది నాయకులకు అవకాశాలు కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే కానీ.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన శ్రీమతి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్నూరు కాపు మెజార్టీ నాయకులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్రను పోషించారు.. సామాజిక న్యాయం నినాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అన్ని కులాల నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కుతుందని ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని గెలుపోటమును నిర్ణయించే శక్తి ఉన్న మున్నూరు కాపు నాయకులకు మెండుగా అవకాశాలు లభిస్తాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఎటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతము మరియు భవిష్యత్తులో కనిపిస్తాయని కొంతమంది నాయకుల తీరును బట్టి మనకు తేటతెల్లం అవుతుంది... గెలిచేదాక ఒక లెక్క, గెలిచాక ఒక లెక్క అని నాయకులు మున్నూరు కాపులను కూరలోని కరివేపాకు తీసివేసినట్లు,మా కుల నాయకులను తీసేస్తే..అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. ఇప్పటికైనా మున్నూరు కాపు నాయకులు కార్యకర్తలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా రాజకీయ ముఖచిత్రంపై కాపు సంఘ నాయకుల ముద్రను పార్టీ పెద్దలైన పిసిసి అధ్యక్షులకు, ఢిల్లీ పెద్దలను కూడా కలిసి సమగ్ర వివరణ ఇవ్వటం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి ఒక నివేదికను సమర్పించాలని మనవి. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్నూరు కాపు ఉద్యోగస్తులపై కూడా పోస్టింగుల విషయంలో వివక్షకు గురవుతున్నారని మా దృష్టికి వచ్చింది. మున్నూరు కాపులకు ఎన్నో అవకాశాలు కల్పించిన కెసిఆర్ లాంటి వ్యక్తుల్ని గద్దించటంలో కాపులు కీలక పాత్ర పోషించారు అది ఖమ్మం జిల్లాలోని నాయకులు అర్థం చేసుకోవాలి.. పద్ధతి మార్చుకోకపోతే అధికారం ఎవరికిశాశ్వతం కాదు కార్యదర్శి మున్నూరు కాపు యువజన సంఘం కట్ల సంతోష్ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :