Sunday, 26 January 2025 07:37:05 PM
 Breaking
     -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

11 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు ప్రజలు నవ్వుతున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మోసపూరితమైన హామీలు ఇచ్చి 11 నెలల పాలించి కాంగ్రెస్ పార్టీ చేస

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 20 November 2024 01:10 PM Views : 143

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 19 అక్షరం న్యూస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసినందుకా మహిళలకు ఇచ్చిన హామీలు వృద్దులకు 4 వేల ఫించన్ ఇవ్వకుండా మోసం చేసినందకా రైతు భరోసా రుణమాఫీ రైతు భరోసా పేరుతో నట్టేట ముంచినందుకా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడ్డారు బిఆర్ఎస్ మాజీమంత్రి కొప్పల ఈశ్వర్ హైదరాబాదులో బిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ హైడ్రా పేరుతో వేల మందిని నిరుపేదల కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చినందుకా దళితులకు రెండో విడత దళితబంధు ఇవ్వనందుకా సంబురాలని అన్నారు గురుకులాల్లో 42 మంది విద్యార్థులు చనిపోయినందుకా చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ ప్రారంభం అయినందుకా ఈ విజయోత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు ఆరు గారంటీలు 420 హామీల్లో ఏది పూర్తిగా నెరవేర్చారో ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి సంబరాలు చేసుకోవాలన్నారు కేసీఆర్ ను తిట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిలేదు అని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎడాపెడా హామీలు గుప్పించింది ఆరు గ్యారెంటీలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టి వాటికి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్‌గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మద్దతు పలికారు వాటిని అమలు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి హామీలు అటకెక్కాయని గుర్తు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి ఏడాదికి చేరువవుతున్నా ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని అయిన విజయోత్సవాల పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :