Monday, 10 February 2025 06:41:46 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్

క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రులకు అనుమతులు ఉండాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ పై ఐ.యం.ఎ సభ్యులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సమావేశం


MD FAHEEM, STAFF REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 14 November 2024 09:39 AM Views : 190

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నవంబర్.13 అక్షరం న్యూస్: క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు మరియు వారికి అందుతున్న వైద్య సదుపాయాలు అక్కడ పనిచేస్తున్న డాక్టర్ల ,సిబ్బంది యొక్క అర్హతను ఆసుపత్రికి వచ్చే రోగులకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే అర్హతకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టెందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించి తక్షణ చికిత్స అందేందుకు జియో ట్యాగింగ్ చేయాలని, ప్రమాదకరంగా ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో మరియు రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల యొక్క ధరల పట్టికను ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐ.ఎం.ఎ అధ్యక్షులు అరికల భాస్కర్ మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అనుమతులు లేని ఆసుపత్రులను ,క్లినిక్ లాబ్లను సీజ్. చేసి ,నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సభ్యులు డా. మధువరన్, డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్, ఉమా మహేశ్వరీ, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :