Monday, 10 February 2025 07:34:30 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ... ఎమ్మెల్యే విజయ రమణారావు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 06 November 2024 05:50 PM Views : 278

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి రూరల్ నవంబర్ 6 అక్షర న్యూస్; పెద్దపల్లి మండలం, నిమ్మనపల్లి & నిట్టూరు గ్రామాలల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. 17 శాతానికి మించి ధాన్యంలో తేమ లేకుండా రైతులు చూసుకోవాలని చివరి గింజవరకు కోనుగోలు చేసే బాధ్యత తనదేనన్నారు. ధాన్యంలో గింజ కూడా కటింగ్ లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 41కిలోలకు ఒక్క గ్రాము కూడా అదనంగా తూకం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని నిర్వాహకులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో ఛైర్మన్లు మాదిరెడ్డి నర్సింహ రెడ్డి, ఆళ్ళ సుమన్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పృథ్వీ రాజ్, పెద్దపల్లి విండో సీఈఓ మధన్ మోహన్, మార్కెట్,సింగిల్ విండో డైరెక్టర్లు, సీసీఐ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :