Monday, 10 February 2025 07:35:57 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

అమరుల ఆశయ సాధనకై పోరాడుదాం

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 06 November 2024 04:19 PM Views : 179

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 6(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని నవంబర్ 1 నుండి 9 వరకు జరుగు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం రోజు న రాత్రి గంగారం మండలం కోమట్ల గూడెం లో కామ్రేడ్ గోగ్గేల లక్ష్మన్న , ఈసం జనార్ధన్, జనగం నారాయణ, పడిదల శ్రీను, కుంజా ఎర్రన్న, గంగారం మండల కేంద్రంలో అమరుడు కామ్రేడ్ పెద్ద బూర్క వెంకటన్న సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కొత్తగూడ మండలం మాజీ ఎంపీపీ, ఇర్ఫా బాబురావు, పూనెం లక్ష్మీనారాయణ,పూనం రామన్న,ల స్తూపాలపై ఎర్రజెండాలు ఎగరవేసి విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బూర్కా వెంకటయ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మాట్లాడుతూ భారవిప్లవోద్యమంలో భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించి అమరులైనారు అని అందులో భాగమే గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో కామ్రేడ్ చంద్రపుల్లా రెడ్డి నాయకత్వాన నిర్మించిన గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం అనేకమంది విప్లవవీర కిశోరాలు ఏజెన్సీ ఆదివాసి మారుమూల ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలలో భాగస్వాములై వారి చివరి శ్వాస వరకు నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేసి అమరులు అయ్యారని వారు అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం విప్లవోద్యమంలో పురోగమిస్తూ అమరుల ఆశయ సాధనకై ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈక రవికుమార్ఈసం కాంతారావు, పెద్ద స్వామి సమ్మయ్య, నరేష్, తాళ్ల కొమిరెల్లి మల్లయ్య, జనగం వెంకన్న, మేడ సమ్మక్క గొగ్గెల లక్ష్మి గుండగాని జనార్ధన్ సమ్మక్క మధుకర్ శ్యాంసుందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :