Wednesday, 07 June 2023 09:59:42 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

పంజాబ్‌లో పంట వ్య‌ర్ధాల కాల్చివేత‌

ఆ బాధ్య‌త మాదే : కేజ్రీవాల్

Date : 04 November 2022 01:02 PM Views : 103

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : న్యూఢిల్లీ అక్షరం న్యూస్ : పంజాబ్‌లో పంట వ్యర్ధాల‌ను రైతులు కాల్చివేస్తున్న విష‌యం తెలిసిందే. దీని వ‌ల్ల ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో జ‌రుగుతున్న పంట వ్య‌ర్ధాల కాల్చివేత‌పై నిందారోప‌ణ‌లు వ‌ద్దు అని కేజ్రీవాల్ తెలిపారు. వాయు కాలుష్యం అనేది నార్త్ ఇండియా స‌మ‌స్య అని, వ‌రి పంట వ్య‌ర్ధాల్ని కాల్చివేయాల‌ని రైతులు కూడా కోరుకోవ‌డం లేద‌ని, కానీ రెండు పంట‌ల మ‌ధ్య త‌క్కువ స‌మ‌యం ఉన్నందున వాళ్లకు మ‌రో అవ‌కాశం లేద‌ని కేజ్రీ అన్నారు. ఒక‌వేళ పంజాబ్‌లో పంట‌ల వ్య‌ర్ధాల‌ను కాల్చివేస్తున్నారంటే దానికి మేమే బాధ్యుల‌మ‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఆ వ్యాఖ్య‌ల‌ను పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా అంగీక‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు అన్నారు. ఒక‌వేళ పంజాబ్‌లో పంట‌ల వ్య‌ర్ధాల‌ను కాల్చివేస్తున్నారంటే దానికి మేమే బాధ్యుల‌మ‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఆ వ్యాఖ్య‌ల‌ను పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా అంగీక‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే వ‌చ్చే ఏడాదిలోగా పంట వ్య‌ర్ధాల కాల్చివేత‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, వ‌చ్చే ఏడాదికి ఇలాంటి కాలుష్యం లేకుండా చూస్తామ‌ని కేజ్రీ అన్నారు. త‌మ ప్ర‌భుత్వానికి కేవ‌లం ఆరు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే వచ్చింద‌ని, ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డంలో మాఫియాలు అడ్డువ‌స్తున్నాయ‌ని, కానీ వ‌చ్చే ఏడాదిలోగా దీనిపై స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 40 ల‌క్ష‌ల ఎక్టార్ల‌లో వ‌రి పంట పండిస్తున్నార‌ని, వ‌చ్చే ఏడాది లోగా ఆ భూముల్లో పంట మార్పిడికి ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. ఢిల్లీ త‌ర‌హాలోనే హ‌ర్యానా, యూపీలోని అనేక న‌గ‌రాల్లో వాయు నాణ్య‌త క్షీణించిన‌ట్లు ఇద్ద‌రు సీఎంలు వెల్ల‌డించారు. ప‌రిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నాన‌రు. ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం నుంచి ఢిల్లీలో ప్రైమ‌రీ స్కూళ్ల‌ను మూసివేస్తున్నారు. రైతులు ప్ర‌త్యామ్నాయ పంట‌ల్ని ఆశ్ర‌యించేందుకు ఎంఎస్పీల గురించి హామీ ఇస్తున్న‌ట్లు సీఎంలు తెలిపారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :