Friday, 01 December 2023 07:21:42 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :

శిక్షణ అనంతరం యువతీ, యువకులు ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలి...-జిల్లా ఉపాధి శాఖాదికారిణి వి.విజేత ...  

Date : 20 November 2023 09:43 PM Views : 130

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ : : స్థానిక నవ లిమిటెడ్ తన సంస్థాగత సంఘసేవా కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన మహిళా సాధికార కేంద్రంలో 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు డి.టి.పి, ట్యాలీ, బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యోగ్యత పత్రాల బహుకరణ సోమవారం  నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి జిల్లా ఉపాధి శాఖాధికారిణి  వి. విజేత, భద్రాద్రి కొత్తగూడెం, లెక్చరర్ కాకతీయ కోపరేటివ్ ట్రైనింగ్ కాలేజ్ వరంగల్, రాజయ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.రాజయ్య  మాట్లాడుతూ 70వ అఖిల భారత సహకార వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను, కార్యక్రమాల వివరాలను తెలియ జేశారు. తాటి ఆకుల ఉత్పత్తులు, నవ లిమిటెడ్ కార్మిక సిబ్బందికి యూనిఫామ్స్ కుట్టడం ద్వారా వచ్చిన నగదును నవయుగ మహిళా త్రిఫ్ట్ సోసైటీ ద్వారా మహిళలకు చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.పి కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థిణి  నిఖిత  మాట్లాడుతూ ఉద్యోగంలో భాగంగా ఈ కోర్సు చేయటం అవసరం అయిందని కాని వేల రూపాయల ఫీజు కట్టి నేర్చుకోవటం గురించి ఆలోచిస్తున్నప్పడు  నవ లిమిటెడ్ వారు ఈ కోర్సు ఉచితంగా అందిస్తున్నరని తెలిసి డి.టి.పి కోర్సులో చేరటం జరిగింది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న అనంతరం తనకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించిందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వి. విజేత  మాట్లాడుతూ మహిళా సాధికార కేంద్రం,  ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఇస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవడం ద్వారా యువతీయువకులు శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలన్నారు.  వారికి కావలసిన సహాయం అందించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆడ్మినిస్ట్రేటర్ సి.యస్. ఆర్  డి. శ్యామ్ సుందర్, టి.అరుణ, అముద, వాసవిరాణి, అరుణ, దివ్య, యం. శ్రీనివాసరావు, శ్రీకాంత్, రాజేశ్వరరావు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

-

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :