Friday, 01 December 2023 07:22:21 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

అధికార పార్టీ అహంకారానికి వ్యతిరేకంగా గలమెత్తిన కలం

ఎమ్మెల్సీ తాత మధు వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం బహిష్కరణ

Date : 20 November 2023 08:10 PM Views : 197

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : ఎమ్మెల్సీ తాత మధు వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం బహిష్కరణ భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం / నవంబర్ 20 /అక్షరం న్యూస్ : భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ తాతా మధు అహంకార పూరిత పోకడలకు నిరసనగా భద్రాచలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు ఒక తాటిపైకి వచ్చి తాతా మధుకి వ్యతిరేకంగా నిరసనగలం విప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుండి భద్రాచలం మీడియాపై తాతా మధు వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ నేటి నుండి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బహిష్కరిస్తున్నట్టు జర్నలిస్టుల జేఏసీ నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం విలేకరుల పట్ల తాత మధు అనేక సందర్భాలలో చునకన చేసి అవహేళనగా మాట్లాడడమే కాక కేటీఆర్ పర్యటన సైతం ఖమ్మం నుండి పాత్రికేయులను పిలిచి రాస మర్యాదలు చేసి భద్రాచలం విలేకరులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అహంకార వైఖరితో వ్యవహరించడంతో భద్రాచలం పట్టణంలోని విలేకరులందరూ తాతా మధు పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉన్న ప్రెస్ క్లబ్బులందరూ ఒకటై జేఏసీకి ఏర్పడి నేటి నుండి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బహిష్కరించడమే కాక ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తున్న గ్రూపుల నుండి కూడా పాత్రికేయులు బయటికి వచ్చేయాలని తీర్మానం చేశారు. ఇప్పటికే అన్ని రంగాలలో ఎన్నికల ప్రచారంలో వెనుక పడుతున్న తెల్ల వెంకటరావుకి విలేకరులు తీసుకున్న నిర్ణయంతో మరింత నష్టం కలిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పార్టీలో అంతర్గత గ్రూపుల గొడవలకు తోడు ఇన్చార్జి తాత మధు వ్యవహారాశైలి తో నేడు పాత్రికేయులు కూడా తెల్లం వెంకట్రావు పై తిరుగుబాటు బహుట వ్యతిరేకంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెల్లం వెంకటరావుకి గోర పరాభవం తప్పదని తెలుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ పాత్రికేయులు తమ వ్యక్తిగత ఎజెండాలను పక్కనపెట్టి ఆత్మగౌరవం కోసం ఒక తాటిపైకి వచ్చి అధికార బిఆర్ఎస్ పార్టీ అహంకారానికి వ్యతిరేకంగా గళం విప్పటం ఒక నూతన పరిణామంగా కనిపిస్తుంది

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :