Friday, 01 December 2023 06:25:26 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

ఒక్క రూపాయికే దహన సంస్కారాలు - తంగళ్ళపల్లిని అభివృద్ధి చేస్తాను

- బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి

Date : 19 November 2023 12:56 PM Views : 21

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల/తంగళ్ళపల్లి/నవంబర్ 20 (అక్షరం న్యూస్): తంగళ్ళపల్లి మండల కేంద్రములో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల కార్యాలయాన్ని ఆదివారము ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత పది సంవత్సరాలలో తంగళ్ళపల్లి మండలంలో ప్రయాణికులకు కావలసినటువంటి బస్టాండ్ ను, కూరగాయలు అమ్ముకోవడానికి మార్కెట్ను ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. నన్ను గెలిపిస్తే తంగళ్ళపల్లి మండలాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతనంగా పెళ్లి చేసుకునే వధువులకు పుస్తె మట్టేలను అందించడం జరిగిందన్నారు. దహాన సంస్కారాల కార్యక్రమం కేవలం 1 ఒక్క రూపాయికే అందిస్తామని తెలిపారు. బీసి బిడ్డగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందని, మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని అన్నారు. టెక్స్టైల్ పార్క్ లో చాలా కార్ఖానాలు మూతపడ్డాయని వీటిని పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని అన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :