Wednesday, 07 June 2023 10:50:19 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

తీగల వంతెన దుర్ఘటన పై జో బైడెన్ సంతాపం

.

Date : 01 November 2022 11:53 AM Views : 93

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : గుజరాత్ మోర్బి జిల్లాలో మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో  చనిపోయిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్  అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్  సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్లిష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. "మోర్బి వంతెన కూలిన ఘటనలో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు జిల్, నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆప్తులను కోల్పోయిన గుజరాత్ ప్రజలతో పాటు మేము సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మేము భారతీయ ప్రజలకు అండగా నిలుస్తాము." అని బైడెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. "గుజరాత్‌లో వంతెన కూలిన విషాద ఘటనలో తమ ఆప్తులను కోల్పోయిన బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాం. భారత ప్రజలకు మేము అండగా ఉంటాము." అని ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే.. గుజరాత్‌ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 140 దాటిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో 47 మంది వరకు చిన్నారులు ఉండటం అందరి హృదయాలను కలిచివేస్తుంది. కాగా, 125 మందిని మాత్రమే మోయగలిగే సామర్థ్యం ఉన్న ఆ వంతెనపైకి 500 మంది చేరడమే కాక.. దాన్ని ఊపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మరోవైపు నిర్లక్ష్యంతో ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తూ 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :