Wednesday, 07 June 2023 11:31:26 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

ఓయో రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. జంటల కదలికల చిత్రీకరణ.. నలుగురు నిందితులు అరెస్ట్

.

Date : 22 October 2022 06:36 PM Views : 97

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : న్యూఢిల్లీ: ఓయో రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి.. అక్కడికి వచ్చే జంటల కదలికలను రహస్యంగా చిత్రీకరిస్తున్న ఒక ముఠా ఆట కట్టించారు నోయిడా పోలీసులు. ఓబాధిత జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించి ఆకస్మిక రైడ్‌ చేయడంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఈసీక్రెట్‌ కెమెరాల బాగోతంలో ఓయో స్టాఫ్‌ పాత్ర ఏమిలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.విష్ణుసింగ్‌, అబ్దుల్‌ వాహవ్‌, పంకజ్‌ కుమార్‌, అనురాగ్‌ కుమార్‌ సింగ్‌ అనే నలుగురు నిందితులు నోయిడాలోని మూడు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్‌ బుక్‌చేసి కమిషన్‌ తీసుకుంటారని, ఈ క్రమంలోనేరూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పారు.ఓయో గదుల్లో జంటల కదలికలన్నీ ఆ కెమెరాల్లో రికార్డవుతాయని, తర్వాత నిందితులు ఆ వీడియోలను సంబంధిత జంటలకు పంపి డబ్బు డిమాండ్ చేస్తారని, డబ్బులుఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ నలుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 11 లాప్‌టాప్‌లు, 21 మొబైల్‌ ఫోన్‌లు, 22 ఏటీఎం కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాంగుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :