Wednesday, 07 June 2023 10:54:58 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?

.

Date : 21 October 2022 06:35 PM Views : 100

అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపాడు బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ప్ర‌స్తుతం అదే జోష్‌తో బాలకృష్ణ త‌న త‌దుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయ‌న హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని.. బాల‌కృష్ణతో సినిమా చేయ‌నుండటంతో ప్రేక్షకుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘మెగా154’ను కూడా మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. కాగా మెగా 154 పోస్ట్‌ ప్రొడక్షన్‌కు కాస్త ఎక్కువ టైం పడుతుందట. దాంతో చిరు సినిమా సంక్రాంతికి వచ్చే చాన్స్‌ తక్కువగా ఉందట. ఈ క్రమంలో మైత్రీ సంస్థ బాలయ్య సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేసే ప్లాన్‌ చేస్తుందట. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న NBK107 ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ‘NBK107’ టైటిల్‌ను శుక్రవారం రాత్రి 8:15 నిమిషాలకు కర్నూలు కొండా రెడ్డి బురుజు దగ్గర లాంచ్‌ చేయనున్నారు. అవుట్ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్‌. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :