Sunday, 02 April 2023 02:46:31 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి దుర్మరణం

.

Date : 18 October 2022 08:28 PM Views : 328

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : కొణిజర్ల : ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం కొనిజర్ల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు పోలీస్ కథనం ప్రకారం చిన్న మునగాల గ్రామానికి చెందిన పగడాల వెంకటేశ్వర్లు తనయుడు పగడాల ఉమామహేశ్వరరావు 15 మృతుడు పక్క గ్రామమైన పెద్ద మునగాలలో పదో తరగతి విద్యను చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సాయంత్రం పాఠశాల నుండి సైకిల్ పై నలుగురు విద్యార్థులతో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఇంటికి అతి సమీపంలోనే పెద్ద మునగాల వైపు నుండి కాచారం కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ నిర్లక్ష్యంతో డ్రైవర్ నడపడంతో విద్యార్థికి ఢీకొనటంతో అక్కడకక్కడే తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామస్తులు సంఘటనకు చేరుకొని విద్యార్థి శవం పై రోదిస్తున్న తీరు పలువురుని కంటతడి పెట్టించింది. విద్యార్థి ఉదయం పూట అందరితో సరదాగా గడిపి పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోకుండానే మృత్యువడిలోకి చేరటంతో తల్లిదండ్రుల రోదనలు ఆవేదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి.విద్యార్థికి ఉన్నత అధికారులు సంఘటనకు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలపాటు శవం వద్దనే నడిరోడ్డుపై ఆందోళన చేపట్టారు. క ఎస్ ఐ టి వై రాజు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆందోళనకారులు తమకు న్యాయం జరిగే వరకూ విద్యార్థి శవాన్ని తరలించవద్దని బేస్మించుకోవడంతో ఆందోళన గ్రామస్తులందరూ చేరటంతో మరింత ఉదృతమైంది. దీంతో స్థానిక పోలీసులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో విద్యార్థి మృతి చెందటంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఈ విషయమై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు