Wednesday, 07 June 2023 11:14:31 AM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :

.

Date : 23 March 2023 03:15 PM Views : 125

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : -టీఎస్ పీఎస్సీకి చెందిన వారికే అత్యధిక మార్కులు... -టీఎస్ పీఎస్సీ చైర్మన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి... -యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/మార్చి 23/అక్షరంన్యూస్ :  గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఛేదించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయంతో పాటు టీఎస్ పీఎస్సీకి చెందిన సబ్యులకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన రాష్ట్ర సర్కారుకు పదవీలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జనార్ధన్ రెడ్డి ప్రశ్నపత్రాలను తన ఆధీనంలో ఉంచుకోవాలని, రేషన్ బియ్యం తీసుకోవాలంటేనే ఓటిపీ తీసుకునే యంత్రాంగం రాష్ట్రంలో ఉన్నప్పుడు టీఎస్ పీఎస్సీ చైర్మన్ సిస్టమ్ ఎలా హ్యాక్ అయ్యిందని ప్రశ్నించారు. విద్యావంతులు, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తులు టీఎస్ పీఎస్సీలో చోటు కల్పించాల్సింది ఉండగా సీఎంవోలో పనిచేసే వారి బంధువులు, బీఆర్ఎస్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన వారికి ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు. కనీసం ప్రత్యేక కార్యాలయం లేని సిట్ కు గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని శోధించాల్సిందిగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారని నిలదీశారు. లీకేజీకి సంబంధించి అన్ని కోణాల్లో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును తప్పనిసరిగా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సాయి, చెనిగారపు నిరంజన్ కుమార్, కాకటి బాబు, పోలే కనకరాజు, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు