Sunday, 02 April 2023 01:39:35 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

.

Date : 07 March 2023 09:47 AM Views : 357

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ మార్చి 6(అక్షరం న్యూస్) నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో 7వ తరగతి చదువుతున్న నాగిల్ల నికిత( 12) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది స్థానిక పోలీసులు ,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండల పరిధిలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నికిత పదరా మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన బుచ్చి రాములు కుమార్తె. నికిత కు తోటి విద్యార్థులతో స్వల్ప ఘర్షణ జరిగినట్టు తెలిపారు. విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప ఘర్షణను ఉపాధ్యాయులు సమన్వయం చేసి ఇద్దరు విద్యార్థుల మధ్య సఖ్యతను కుదిరించారు. అయినప్పటికీ కొంత సమయం తర్వాత ఎవరూ లేని సమయంలో విద్యార్థిని నికిత తరగతి గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు .కొంత సమయం తర్వాత విద్యార్థులు వెళ్లి చూడడంతో ఉరివేసుకొని ఉండటం గమనించి తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు .సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనపై అమ్రాబాద్ ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

<