అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తిరుమలాయపాలెం/అక్టోబర్15/ అక్షరం న్యూస్:-తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం పై కప్పు పెచ్చులు పెచ్చులుగా ఉడుతూ ఇనుప కడ్డీలు బయటకు వచ్చి ఏ క్షణంలో భవనం కూలుతుందని భయంతో అధికారులు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని దాని స్థానంలో నూతన భవనం నిర్మాణం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అన్నారు. తహసిల్దార్ కార్యాలయం శనివారం సిపిఎం బృందం సందర్శించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడం కోసం 2000 సంవత్సరంలో ఎమ్మార్వో కార్యాలయం నిర్మించడం జరిగిందని నిర్మాణ కాంట్రాక్టర్ సరైన నాణ్యత పాటించకపోవడం వల్ల బిల్డింగ్ అంత పెచ్చలు పెచ్చలుగా ఊడుతూ ప్రజల పైన పడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన భవనం కురవడం వలన విలువైన డాక్యుమెంట్స్,కంప్యూటర్ సామాగ్రి మొత్తం కూడా తడిసిపోతున్నాయని అలాగే అవసరాలకు వచ్చిన ప్రజలు కూడా చినుకులకు తడవలసిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. మండల కేంద్రమైనటువంటి తహసిల్దార్ కార్యాలయం ను అధికారులు కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన శిధిలావస్థకు వచ్చిందని ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి కూలిపోయే దశలో ఉన్న తహసిల్దార్ కార్యాలయం స్థానంలో కొత్త భవన నిర్మించి ప్రజలకు, కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు రక్షణ కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ప్రభుత్వం డిమాండ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించాలని లేనియెడల పెద్ద ఎత్తున ప్రజలందరిని సమీకరించి ఉద్యమం నిర్మించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కొల్చల స్వామి నిర్సుల వెంకటేశు మద్దినేని శ్రీనివాస్ ఇప్పుల పుష్పావతి బి రాములు కొమ్ము నాగేశ్వరరావు కే ఉప్పలయ్య కె వెంకన్న కోటయ్య వల్లపు కోటయ్య పీలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily