అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / మంచిర్యాల జిల్లా : ---65,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా డీఎస్పీ భద్రయ్య మంచిర్యాలబ్యూరో,ఫిబ్రవరి27, అక్షరం న్యూస్:జిల్లా కొనుగోలు శాఖ అధికారి కె.శారద హనుమాన్ కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ కోసం విశ్వేశ్వర్ వద్ద నుంచి సోమవారం రూ.65,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా)డిఎస్పి భద్రయ్య తెలిపారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాటన్ ఆగ్రో ఏజెన్సీ లైసెన్స్ రెన్యువల్ కోసం విశ్వేశ్వర్ అనే స్థానిక వ్యాపారి దరఖాస్తు చేసుకోగా సదరు అధికారిని రూ.ఒక లక్ష లంచం డిమాండు చేసింది.ఆ ఒప్పందం ప్రకారం బాధితుడు మొదటి దఫాగా రూ.15 వేలు ఆమెకి ఇచ్చాడు.అనంతరం ఏసీబీని వ్యాపారి ఆశ్రయించాడు.ఆ మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసులో వ్యాపారి నుంచి రెండో దఫాగా రూ.65వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను పట్టుకున్నారు.ఆ మేరకు కేసు నమోదు చేసి కోర్టు రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు.
.
Aksharam Telugu Daily