Sunday, 02 April 2023 01:33:59 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

అంతా దుమ్ముమయం..

.

Date : 22 February 2023 10:19 AM Views : 823

అక్షరం తెలుగు డైలీ - స్పెషల్ స్టోరి / వరంగల్/నెక్కొండ : - ప్రయానికులపై ప్రభావం.. పట్టించుకోని అధికారులు,ప్రజా ప్రతినిధులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు... నెక్కొండ, ఫిబ్రవరి 22,(అక్షరం న్యూస్):- మండల కేంద్రం నుండి గుండ్రపల్లి, పెద్దకొర్పొల్ గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారి పైన పాత సిసి రోడ్డును తొలగించి కొత్త సీసీ రోడ్డుకు పనులు ప్రారంభించి కంకర పోశారు. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే వాటర్ క్యూరింగ్ కోసం కాంట్రాక్టర్ రోడ్డుపై ఏర్పాటు చేసిన మట్టిని, డస్ట్ ని తూతూ మంత్రంగా పైపైన పోసి వాటర్ కొట్టకుండా వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా మట్టి రోడ్డు పైనే ఉండిపోయి నిరంతరం వాహనాలు తిరిగే ప్రాంతం కాబట్టి వచ్చి పోయే భారీ వాహనాలతో విపరీతంగా దుమ్ము లేస్తుంది.. దుమ్మే కదా అని తేలిగ్గా తీసి పారేయలేం.. ఆ రహదారి మీదుగా టు విల్లర్ పై వెళ్లే ప్రయాణికుల కు మరియు రహదారి పక్కన భూమి ఉన్న రైతుల ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. డస్ట్ ఎలర్జీ తో బాధపడుతున్నామని దుమ్ము కంట్లో పడి యాక్సిడెంట్లు అవుతున్నాయని మాకు ప్రమాదం జరుగుతే బాధ్యులు ఎవరు..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు,లారీలు, ఈ దారి గుండానే వెళ్లడంతో దుమ్ము లేచి వెనుక వచ్చే చిన్న వాహనదారులపై పడడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు. డస్ట్ కూడా మొత్తం పోయకుండా సగం సగం పోసి సగం కంకరతో వదిలేయడంతో వచ్చి పోయే వాహనాలు కంకరపై నుండి జారి కిందపడి హాస్పిటల్ పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ కంకర రోడ్డు మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :