అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / మహబూబాబాద్ : గూడూరు, ఫిబ్రవరి 16, (అక్షరం న్యూస్):- మండల కేంద్రంలోని నర్సంపేట రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ ముందు లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన లో దన్నసరి లక్ష్మయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.వారిని చికిత్స నిమిత్తం వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరు మహబూబాబాద్ జిల్లా గంగారాం మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
*****
Aksharam Telugu Daily