అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : దర్శక దిగ్గజం మణిరత్నం (Maniratnam), సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబినేషన్లో సుధీర్ఘకాలం తర్వాత ఒక చిత్రం రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కలయికలో 32 ఏళ్ల క్రితం ‘దళపతి’ (Thalapathi) సినిమా వచ్చింది. ఆ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. మరోమారు వీరిద్దరు కలిసి పనిచేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే మణిరత్నం చెప్పిన కథకు రజనీకాంత్ అంగీకరించారని తెలుస్తోంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) నిర్మించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్-2’పై దృష్టిని కేంద్రీకరించగా.. రజనీకాంత్ ‘జైలర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్లో మూవీని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దాంతో.. ఈ వార్తలు నిజమవ్వాలని ఈ వారి అభిమానులు కోరుకుంటున్నారు.
.
Aksharam Telugu Daily