Sunday, 02 April 2023 02:04:25 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

శ్రీశైల పాదాచార శివ స్వాములకు పండ్లు,అన్నప్రసాద పంపిణీ.

.

Date : 09 February 2023 07:13 PM Views : 101

అక్షరం తెలుగు డైలీ - కల్చరల్ / నాగర్ కర్నూల్ జిల్లా /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా/తెల్కపల్లి/ ఫిబ్రవరి 9(అక్షరం న్యూస్) నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ బస్ స్టాప్ ఎదురుగా శ్రీ లలితా సహస్ర నామ సేవా సమితి నాగర్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో పదవ వార్షిక శ్రీశైలం పాదచార శివ స్వాములకు అన్నప్రసాద, పండ్లు, ఫలహారాలు పంపిణీ కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షురాలు కొత్త రేవతి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివదీక్ష స్వికరించిన ఈప్రాంత శివ స్వాములు, మరియు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కాలినడకన వెళ్లే శివ స్వాములు, వారి వెంట కాలినడకన శ్రీశైలం వెళుతున్న భక్తులకు నేటి నుండి శివరాత్రి వరకు ప్రతిరోజు ఉదయం సమయంలో పండ్లు, మధ్యాహ్నం అన్న ప్రసాదం, సాయంత్రం వేళలో పండ్లు, అల్పాహార పంపిణీ,త్రాగునీటి పంపిణీ ప్రత్యేకంగా వేసిన టెంట్ శిబిరంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సాయంత్రం వేళలో శ్రీ లలితా సహస్రనామ కమిటీ మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రదోషకాల సమయంలో శివ స్వాములచే ప్రత్యేక భజన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో శివ స్వాములకు అలంకరణ నిమిత్తం విభూతి, గంధం, కుంకుమ అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాంతంలోని శివ స్వాములు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆమె కోరారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :