Wednesday, 07 June 2023 12:17:39 PM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

రైతుబంధు అమ‌లు చేయండి.. ఒడిశాలో 10 వేల మంది రైతుల పాద‌యాత్ర‌

.

Date : 13 October 2022 06:21 PM Views : 102

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : భువ‌నేశ్వ‌ర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమ‌లు చేయాల‌ని న‌వ నిర్మాణ్ కిసాన్ డిమాండ్ చేసింది. నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ వ‌ర‌కు 10 వేల మంది రైతులతో 7 రోజుల పాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఒడిశా రైతులకు సౌత్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్ చైర్మన్ కోటపాటి నరసింహ నాయుడు,వెంకటేశ్వర్లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు పాద‌యాత్ర‌గా బ‌య‌ల్దేరిన రైతుల‌ను జాస్పూర్ జిల్లా ధ‌న్‌మండ‌ల్ ప‌ట్ట‌ణంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న‌ప్ప‌టికీ, త‌మ పాద‌యాత్ర‌ను కొన‌సాగించి భువ‌నేశ్వ‌ర్‌కు చేరుకుంటామ‌ని రైతులు స్ప‌ష్టం చేశారు. రేపు మరో 5 వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొంటారని రైతు ఉద్య‌మ నాయ‌కులు ఒడిశా ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. పాదయాత్ర ను అడ్డుకోవడంతో ధన్మండల్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్షయ్ కుమార్ అనే రైతు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై ఇప్పటికే అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలతోనే అక్కడి రాష్ట్ర ప్రజలు సంపన్నులు అవుతున్నార‌ని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే.. -ధాన్యంకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. -తెలంగాణ రాష్ట్రంలో నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఒడిశాలో కూడా నేరుగా రైతుల వద్దనే ధాన్యం కొనుగోలు చేయాలి. -వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఇవ్వాలి. -రైతులకు కనీస పెన్షన్ రూ. 5 వేలు ఇవ్వాలి.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :