Wednesday, 07 June 2023 12:21:05 PM
 Breaking
     -> ఓ ఆర్ ఆర్ పై స్వాగత బ్యానర్లు..      -> ప్రైవేట్ ఆస్పత్రిలో మోసాలు....      -> ఘనంగా టీపీటీఫ్ ఆవిర్భావ వేడుకలు..      -> ఫ్లాష్.. ఫ్లాష్.. మంత్రి హరీష్ రావు స్వగ్రామం తోటపల్లిలో రైతుల దార్నా ..      -> ధాన్యం కొనుగోలు కేంద్రంలో విషాదం.. నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..      -> ఇప్పటిదాకా చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్న దేమిటి?..      -> చుట్టం చుట్టుకు వచ్చి మృత్యువాత పడ్డ యువకుడు ..      -> రేపటి నుంచి ఠాగూర్ స్టేడియంలో పెద్దఎత్తున సిఎం కప్ క్రీడా పోటీలు..      -> సాంబయ్య పల్లి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రెండు ఎకరాల మొక్కజొన్న పంట నష్టం..      -> అంగరంగ వైభవంగా శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ...      -> దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు..      -> పీవైఎల్ జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి..      -> సమస్యలకు నెలవుగా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం....      -> అమెరికా పర్యటనలో కేటిఆర్ నోట బెల్లంపల్లి మాట.....      -> వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ ..      -> ఈ కరీఫ్ సీజన్లో ఎంటియూ 1001 ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు..      -> మద్యం ధరలు తగ్గినా.. అవే పాత రేట్లు. ఖని లో అమలు కాని ప్రభుత్వం తగ్గించిన రేట్లు. మద్యం ధరలు పెరిగితే రాత్రికి రాత్రే అమలు. ఖనిలో అసలు ఎక్సైజ్ శాఖ ఉంద..      -> విద్యుత్ ఘాతంతో వరి పంట దగ్ధం...      -> సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో నవోదయ విద్యార్థుల 100% ఉత్తీర్ణత..      -> కొతగూడలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు..

ములాయం అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

.

Date : 12 October 2022 01:33 PM Views : 95

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : సైఫయి(యూపీ) : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ములాయం సొంత గ్రామమైన యూపీలోని ఇటావా జిల్లా సైఫయిలో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితికి కొడుకు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిప్పంటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ములాయం (82) సోమవారం గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో కన్నుమూశారు. సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని సైఫయికి తరలించారు. మంగళవారం ఉదయం ఆయన సొంత ఇంటి నుంచి శ్మశానవాటికకు సాగిన అంతిమయాత్రలో అనేక మంది ప్రముఖులు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేళా గ్రౌండ్ వద్ద ములాయంకు ప్రజలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ములాయం పార్థివదేహాన్ని ఉంచిన ట్రక్కుపై అఖిలేశ్ తో పాటు ఆయన సోదరుడు శివ్ పాల్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు, యోగా గురువు బాబా రాందేవ్, తదితరులు నిలుచున్నారు. వేలాది మంది అభిమానులు ట్రక్కును అనుసరిస్తూ ‘నేతాజీ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ అశ్రునయనాలతో తుదివీడ్కోలు పలికారు. సైఫయి జనసంద్రం నేతాజీని చివరిసారిగా చూసేందుకు లక్షలాది మంది గ్రామానికి తరలివచ్చారు. సైఫయి మొత్తం జనసంద్రంలా మారింది. ఎక్కువ మంది తెల్లని దుస్తులు ధరించి వచ్చారు. వాన చినుకులు పడుతున్నా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కిలోమీటరుకుపైగా క్యూలో నిలబడి ఆయనను చివరిచూపు చూసుకుని వీడ్కోలు పలికారు. ప్రముఖుల హాజరు ములాయం అంత్యక్రియలకు రక్షణ మంత్రి రాజ్​నాథ్, స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, యూపీ సీఎం యోగి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం యేచూరి, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్, సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్, ఆమె కొడుకు అభిషేక్ బచ్చన్, తదితరులు హాజరయ్యారు.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :