అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / : హైదరాబాద్ : కేంద్రంలో రాబోయేది కిసాన్ సర్కారేనని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్, డిప్యూటీ స్పీకర్ జై సింగ్, ఎంపీ విక్రమ్జిత్ సింగ్ సహని, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్ జీత్ సింగ్ నిజామాబాద్ పర్యటనకు రాగా.. ప్రతినిధుల బృందానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుల్తార్ సింగ్ సాంద్వాన్ మాట్లాడారు. పంజాబ్లో ఆప్ కొత్తగా అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ అభివృద్ధి బాగుందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలువుతన్న పథకాలు దేశాన్నే ఆలోచింపజేస్తున్నాయన్నారు. రైతులకు వెన్నుదనున్నగా రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేలు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు కరెంటు ఇస్తున్నారని ప్రశంసించారు. మనం వేసుకునే చెప్పులకు ధర ఉంది కానీ.. కేంద్రం రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముందుచూపుతో నీటి కొరత లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఇవ్వడం హర్షనీయమన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల తాను ఒకే కాలేజీలో చదువుకున్నామని, వారితో ఉన్న సాన్నిహిత్యంతో నిజామాబాద్ నగరానికి వచ్చామన్నారు. నిజామాబాద్ నగరం గణేశ్ బిగాల నేతృత్వంలో బాగా అభివృద్ధి చెందిందన్నారు. కలెక్టరేట్, ఐటీ హబ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. బిగాల గణేశ్ ఆతిథ్యం సంతోషాన్ని కలిగించిందన్నారు. కిసాన్ సర్కార్ కోసం పనిచేస్తున్న కేసీఆర్కు అందరం మద్దతివ్వాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ నుడ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily