GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/డిసెంబర్ 14/అక్షరం న్యూస్: మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కత్తెర గుర్తుతో ఎడ్ల అఖిల రాజు ప్రచారం జోరుగా దూసుకెళ్తోంది .ఊరి ఆడబిడ్డను ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గ్రామం అభివృద్ధి నా లక్ష్యం తప్పు చేస్తే నిలదీయండి అంటూ ప్రచారంలో ముందుకెళ్తుంది, పెద్దంపల్లి గ్రామానికి గడపగడపకు తాను గెలిచాక గ్రామ ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా గ్రామ అభివృద్ధి ఎజెండాగా ప్రజల కష్టంలో తాను ముందుంటానని , గ్రామంలో ఉన్న సమస్యలన్నీటిని పరిష్కరిస్తామని ,అభివృద్ధిలో గ్రామం ముందుండేలా చేసి చూపిస్తామని అన్నారు ఈ సందర్భంగా గ్రామ ఓటర్ మహాశయులందరికి వారి అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేయాలని అన్నారు. ప్రతి ఒక్క ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily