Monday, 12 January 2026 11:52:09 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బిజెపి పార్టీనీ ఆదరించండి... కేంద్ర ప్రభుత్వాన్నిధులతోనే పంచాయతీల పాలన... బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 December 2025 11:22 AM Views : 206

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 14 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ పంచాయతీలోని పలు వార్డులకు సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన ప్రచారంలో శనివారం బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు తల్లాడ మండల అధ్యక్షులు చల్ల నాగులుతో కలిసి పాల్గొన్నారు. తల్లాడ పంచాయతీలోని 5వ వార్డ్ లోని వేము రజితను గెలిపించాలని విద్యావంతులకు పట్టం కడితే పంచాయతీ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పలువార్డులలో అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ ఓటర్లను ఓట్ల అభ్యసించారు. గడపగడపకు పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే సాధ్యమని పంచాయతీకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతాయని తెలిపారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలు నుంచి అందుతున్న రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలలో నడిచే పలు పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరును ప్రస్తావిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పంచాయతీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థులకు గెలిపించి పంచాయతీల యొక్క అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ఓటర్లను కోరారు. పంచాయతీల యొక్క అభివృద్ధి సాధ్యమని ధన ప్రభావానికి లొంగకుండా న్యాయం చేసే అభ్యర్థులను ఎంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సర్పంచ్ అభ్యర్థి చల్లా నాగులు, ప్రధాన కార్యదర్శి పెరిక కిరణ్, పార్టీ ఉపాధ్యక్షులు గొల్లమందల నరేష్ మేము రజిత కార్యదర్శి చల్లా నరేష్, తమ్మిశెట్టి కృష్ణ, సత్తుపల్లినియోజకవర్గ నాయకులు సంగీతం సాయి చంద్, పులి వెంకటేశ్వర్లు, చౌడా నాగేశ్వరరావు, నరసింహారావు, పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :